పార్థసారథి మృతిపై చంద్రబాబు విచారం

ABN , First Publish Date - 2022-04-09T02:03:03+05:30 IST

కుప్పం గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్‌ పార్థసారథి మృతి టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం విచారం వ్యక్తం చేశారు.

పార్థసారథి మృతిపై చంద్రబాబు విచారం

కుప్పం: కుప్పం గంగమ్మ ఆలయ మాజీ  చైర్మన్‌ పార్థసారథి మృతి టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం విచారం వ్యక్తం చేశారు. డబ్బులకు, పదవులు అనే విష సంస్కృతిని వైసీపీ నేతలు కుప్పంలోనూ తీసుకొచ్చారని విమర్శించారు. గంగమ్మగుడి ఛైర్మన్‌గా పనిచేసిన బలహీన వర్గానికి చెందిన పార్థసారథి సొంత పార్టీలో అవమానాలకు ప్రాణాలు తీసుకోవడం విచారకరమన్నారు. పార్థసారథి ప్రాణాలు పోవడానికి కారణమైన వారిపై ఎందుకు కేసు నమోదు చేయడంలేదని ప్రశ్నించారు. సెల్ఫీ వీడియోలో పార్థసారథి చెప్పిన మాటల ఆధారంగా కేసు నమోదు చేయాలని, ఆయన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలన్నారు. పార్థసారథి కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Updated Date - 2022-04-09T02:03:03+05:30 IST