చంద్రబాబు సంతాపం

ABN , First Publish Date - 2020-08-10T09:39:16+05:30 IST

అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. ‘ఈ ప్రమాదం తీవ్ర మనస్తాపం కలిగించింది. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు

చంద్రబాబు సంతాపం

అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. ‘ఈ ప్రమాదం తీవ్ర మనస్తాపం కలిగించింది. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సరైన సదుపాయాలు కల్పించకపోవడం వల్లే ప్రైవేటు కొవిడ్‌ సెంటర్‌లో చికిత్స పొందుతూ కరోనా బాధితులు మృతి చెందారని టీడీపీ నేతలు గద్దె రామ్మోహన్‌, బొండా ఉమ ఆరోపించారు. పెయిడ్‌ ఆస్పత్రులు మృత్యు శకటంగా మారటం దురదృష్టకరమని అన్నారు. లక్షల రూపాయలు తీసుకుంటూ కనీస భద్రతా చర్యలు తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను గుణపాఠంగా తీసుకొని మెరుగైన ఏర్పాట్లు చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు.

Updated Date - 2020-08-10T09:39:16+05:30 IST