చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు: కన్నబాబు

ABN , First Publish Date - 2020-06-06T23:18:52+05:30 IST

భూసేకరణలో టీడీపీ అధినేత చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంటిడ్కోకు రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించారు.

చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు: కన్నబాబు

అమరావతి: భూసేకరణలో టీడీపీ అధినేత చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంటిడ్కోకు రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 26.76 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని, 6.18 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. గజం రూ.20 వేలు ఉన్న చోట కూడా కొనుగోలు చేసి భూసేకరణ చేశామని తెలిపారు. 25,842 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,070 ఎకరాల ప్రైవేటు భూములు సేకరించామని, పేదల ఇళ్ల స్థలాల కోసం రూ.6,500 కోట్లు ఖర్చు చేశామని మంత్రి పేర్కొన్నారు. జులై 8న ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు పట్టాలు ఇస్తామని, 2023 నాటికి మొత్తం 30 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని కన్నబాబు చెప్పారు.

Updated Date - 2020-06-06T23:18:52+05:30 IST