మెయిల్ ద్వారా గవర్నర్కు చంద్రబాబు లేఖ
ABN , First Publish Date - 2020-04-11T00:52:01+05:30 IST
మెయిల్ ద్వారా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కమిషనర్ నియామక అర్హత నిబంధనలు మార్పుపై ఆర్డినెన్స్ ..
అమరావతి: మెయిల్ ద్వారా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కమిషనర్ నియామక అర్హత నిబంధనలు మార్పుపై ఆర్డినెన్స్ .. కొత్త కమిషనర్ నియామకంపై గవర్నర్కు చంద్రబాబు లేఖ రాశారు. కరోనా కారణంగా స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నందున.. పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. రమేష్ కుమార్ను మార్చేందుకు దొడ్డిదారిన సవరణలు చేశారని విమర్శించారు. ఐదేళ్ల కాలానికి గవర్నర్ ద్వారానే ఎస్ఈసీ నియామకం జరిగిందని గుర్తుచేశారు. ఎస్ఈసీ నియామక అర్హత నిబంధనలు మార్చడం అక్రమమన్నారు. కమిషనర్ పదవిలో కొనసాగుతుండగా సవరణలు అనైతికం, చట్ట విరుద్ధమని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్కు చంద్రబాబు లేఖలో కోరారు.