చిత్తూరు కలెక్టరుకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2022-02-24T17:18:58+05:30 IST

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కలెక్టరుకు లేఖ రాశారు.

చిత్తూరు కలెక్టరుకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కలెక్టరుకు లేఖ రాశారు. కుప్పం మండల తాహసీల్దార్ సురేష్ బాబు సర్వేయర్ ముని లావణ్యను వేధిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. నిడమూరు గ్రామంలో సర్వేయర్‌గా విధుల్లో ఉన్న ముని లావణ్య ప్రొబేషన్ డిక్లేర్ చేయకుండా అడ్డుకుంటానని బెదిరిస్తున్నారని, సురేష్ బాబు వేధింపులతో ముని లావణ్య ఆత్మహత్య యత్నం చేసిందన్నారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, తాహసీల్దార్‌పై అవినీతి, మహిళలను వేధిస్తారనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు. కుప్పం మండల తాహసీల్దార్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ముని లావణ్య కోలుకునేంత వరకు ఆమె చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించాలని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2022-02-24T17:18:58+05:30 IST