ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ
ABN , First Publish Date - 2021-06-20T17:57:03+05:30 IST
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మల్లిఖార్జున్పై దాడికి సంబంధించిన వీడియోను లేఖకు జతచేశారు.
అమరావతి: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మల్లిఖార్జున్పై దాడికి సంబంధించిన వీడియోను లేఖకు జతచేశారు. నెల్లూరు జిల్లాలో దాడికి గురైన ఎస్సీలపైనే అక్రమ కేసులు పెట్టారని, మట్టి మాఫియాను ప్రశ్నించిన మల్లిఖార్జున్ను వేధించారని తెలిపారు. మల్లిఖార్జున్పై నలుగురు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. మల్లిఖార్జున్పైనే తప్పుడు కేసు పెట్టి రౌడీషీట్ తెరిచారని, ప్రజల హక్కులను రక్షించలేని విధంగా పోలీసుల చర్యలున్నాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.