హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రబాబు

ABN , First Publish Date - 2022-08-07T15:26:01+05:30 IST

Delhi: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు బయలుదేరారు. శనివారం ఢిల్లీలో ఆజాదీ కా అమృత్

హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రబాబు

Delhi: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు బయలుదేరారు. శనివారం ఢిల్లీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (Azadi ka Amrut Mahostav) జాతీయ కమిటీ సమావేశంలో హాజరైన చంద్రబాబు.. పలువురు కేంద్ర మంత్రులు అమిత్ షా (Amit Sha), నిర్మలా సీతారామన్ (Nirmala Seeta Raman), రాజకీయ నేతలు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, పలు రంగాల ప్రముఖులను కలిశారు. సమావేశం అనంతరం చంద్రబాబు, ప్రధాని మోదీ ప్రత్యేకంగా సుమారు ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. అప్పుడప్పుడు ఢిల్లీ రావాలని చంద్రబాబును ప్రధాని కోరినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు, తెదేపా బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-08-07T15:26:01+05:30 IST