ప్రభుత్వంపై బురదజల్లే యత్నం దారుణం

ABN , First Publish Date - 2020-10-01T07:59:53+05:30 IST

‘‘ప్రతిపక్ష నేత చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. సస్పెండ్‌ అయిన జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి జరిగితే ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నారు...

ప్రభుత్వంపై బురదజల్లే యత్నం దారుణం

  • ‘దాడి’ చేసింది టీడీపీకి చెందిన ప్రతాపరెడ్డి: మంత్రి సుచరిత


గుంటూరు, సెప్టెంబరు 30: ‘‘ప్రతిపక్ష నేత చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. సస్పెండ్‌ అయిన జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి జరిగితే ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ ట్విటర్‌లో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయటం దారుణం’’ అని హోం మంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. కారుకు దారి ఇవ్వలేదన్న కారణంపై గొడవ జరిగిందన్నారు. వాస్తవం ఇదికాగా, దళితులపై దాడులంటూ టీడీపీడ్రామాలు చేయటం తగదన్నారు. 


Updated Date - 2020-10-01T07:59:53+05:30 IST