టీడీపీ నేతల పనితీరుపై చంద్రబాబు సీరియస్

ABN , First Publish Date - 2022-04-30T02:35:28+05:30 IST

టీడీపీ నేతల పనితీరుపై చంద్రబాబు సీరియస్

టీడీపీ నేతల పనితీరుపై చంద్రబాబు సీరియస్

అమరావతి: కాకినాడ టీడీపీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష ముగిసింది. టీడీపీ నేతల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అరాచకాలను ఎండగట్టడంలో నేతలు వైఫల్యం చెందారని చంద్రబాబు మండిపడ్డారు. అంతర్గత విభేదాలతో పార్టీకి చేటు తెస్తున్నారని, పనితీరు మార్చుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తానని చంద్రబాబు హెచ్చరించారు. ఉమ్మడిగా పోరాటం చేస్తేనే మంచి ఫలితం వస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-30T02:35:28+05:30 IST