నేను అధికారం కోసం ఇక్కడికి రాలేదు..: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-02-19T19:23:30+05:30 IST

ప్రకాశం జిల్లా: పిచ్చి తుగ్లక్‌ చేతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్‌ అపహాస్యం అవుతోందని..

నేను అధికారం కోసం ఇక్కడికి రాలేదు..: చంద్రబాబు

ప్రకాశం జిల్లా: పిచ్చి తుగ్లక్‌ చేతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్‌ అపహాస్యం అవుతోందని, అభివృద్ధి ఆగిపోయిందని, సంక్షేమం లేదని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. బుధవారం ప్రకాశం జిల్లా, పరుచూరి నియోజకవర్గంలో ప్రజా చైతన్యయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తాను అధికారం కోసం ఇక్కడికి రాలేదని.. అధికారం తనకు కొత్త కాదని అన్నారు. 9 నెలల పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ప్రజలే చూడాలన్నారు. ఒక్క సారి ఛాన్స్‌ అంటే ఓటేశారు.. దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని చంద్రబాబు అన్నారు.


మమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టి.. ప్రజల భవిష్యత్‌ను నాశనం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని  చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఒక మాయ ప్రజల్ని ఆకట్టుకుందన్నారు. శెనగలకు మద్దతు ధర ఇస్తామన్నారు.. ఇప్పుడు కొనేవాళ్లే లేరని అన్నారు. 34 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పేదలకు కడుపు నిండా తిండిపెట్టే అన్న క్యాంటీన్లు ఏమయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు.


Updated Date - 2020-02-19T19:23:30+05:30 IST