చంద్రబాబుది గోబెల్స్ ప్రచారం: మంత్రి రజని
ABN , First Publish Date - 2022-09-23T08:25:28+05:30 IST
చంద్రబాబుది గోబెల్స్ ప్రచారం: మంత్రి రజని
గుంటూరు, సెప్టెంబరు 22: రాష్ట్రంలో మెడికల్ కళాశాలలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి విడుదల రజని విమర్శించారు. గుంటూరులోని గురువారం ఆమె మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను తానే తీసుకొచ్చినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకోవటం విడ్డూరంగా ఉంది. విభజన చట్టం ప్రకారం ఎయిమ్స్ ఇవ్వాలని సీఎం జగన్ కేంద్రంపై వత్తిడి తీసుకొచ్చి సాధించారు. నెల్లూరు మెడికల్ కాలేజీ అప్పటి సీఎం వైఎ్సఆర్ చొరవతో వచ్చింది. రిబ్బన్ కట్ చేసినంత మాత్రాన చంద్రబాబు ఆ కాలేజీ తెచ్చినట్టా?’’ అని మంత్రి ప్రశ్నించారు.