నియోజకవర్గాలలో ఇంచార్జ్లపై చంద్రబాబు ఫోకస్
ABN , First Publish Date - 2021-09-04T00:58:17+05:30 IST
నియోజకవర్గాలలో ఇంచార్జ్లపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. గత మూడు రోజులుగా పలు జిల్లాల నేతలతో ఆయన వరుస భేటీలు అవుతున్నారు.
అమరావతి: నియోజకవర్గాలలో ఇంచార్జ్లపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. గత మూడు రోజులుగా పలు జిల్లాల నేతలతో ఆయన వరుస భేటీలు అవుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు ఇంచార్జ్ మార్పుపై నేతలతో మంతనాలు చేస్తున్నట్లు జిల్లా టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ రోజు కడప జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇంచార్జ్ లేని జమ్మలమడుగు నియోజకవర్గంపై చర్చించినట్లు తెలుస్తోంది. చంద్రబాబును కలిసేందుకు పార్టీ కార్యాలయానికి సత్తెనపల్లి టీడీపీ కార్యకర్తలు వచ్చారు. కోడెల శివరాంకే బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబును కార్యకర్తలు కోరారు. కొద్దిసేపట్లో ప్రకాశం జిల్లా నేతలతో ఆయన భేటీ అవుతారు. జిల్లా వ్యవహారాలు, వెలిగొండ సమస్యపై చర్చించే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అమరావతిలో చంద్రబాబును మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కలిశారు.