కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2021-02-25T23:51:53+05:30 IST

కుప్పం నియోజకవర్గంపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. కుప్పం నియోజకవర్గంలో

కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు

చిత్తూరు: కుప్పం నియోజకవర్గంపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడి ఉంటే ఫలితాలు వేరే విధంగా ఉండేవని, కుప్పంలో నాయకత్వ మార్పును యువత కోరుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు. ఆ దిశగా రాబోయే ఎన్నికల్లోనే కాకుండా నాయకత్వంలో కూడా యువతకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. కుప్పంలో యువతకి నాయకత్వ భాద్యతలు ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. యువత పార్టీకి కొండంత అండ అని, అలాంటి యువతకి కుప్పం నుండే నాయకత్వ భాద్యతలు అప్పగిస్తామని చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు కుప్పంలో గురు, శుక్ర, శని వారాల్లో మూడు పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు గుడుపల్లె మండలం ద్వారా కుప్పం నియోజకవర్గంలో ప్రవేశించే చంద్రబాబు శనివారం మధ్యాహ్నం 12.30 గంలకు ఇక్కడినుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్‌ను బుధవారం టీడీపీ వర్గాలు విడుదల చేశాయి.  


Updated Date - 2021-02-25T23:51:53+05:30 IST