వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

ABN , First Publish Date - 2020-08-11T04:07:24+05:30 IST

వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. పాలకుల దుర్మార్గం, అణచివేత, అహంకారం, వివక్షత, ఇవన్నీ పెచ్చుమీరితే యువత ఎలా పక్కదారి

వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

అమరావతి: వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. పాలకుల దుర్మార్గం, అణచివేత, అహంకారం, వివక్షత, ఇవన్నీ పెచ్చుమీరితే యువత ఎలా పక్కదారి పడుతుందో చెప్పడానికి ప్రసాద్ అనే దళిత యువకుడే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ నేత ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు సీతానగరం పోలీస్ స్టేషన్‌లో వరప్రసాద్ అనే దళిత యువకుడికి శిరోముండనం చేసి అవమానించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇంతవరకు ప్రసాద్‌కు న్యాయం జరగలేదు. ఫలితంగా తాను నక్సలైట్‌గా మారేందుకు అనుమతి ఇవ్వమంటూ రాష్ట్రపతికి ప్రసాద్ లేఖ రాశాడు. దీనిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం తీరు వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. వరప్రాసద్ లేఖ విషయం తెలిసి చాలా బాధపడ్డానని చంద్రబాబు పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడిలో ఇటువంటి ఆలోచన వచ్చిందంటే రాష్ట్రంలో వ్యవస్థలు ఎంత ప్రమాదకరంగా దిగజారాయో ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2020-08-11T04:07:24+05:30 IST