Chandrababu: ఏపీలో సైకో పాలన

ABN , First Publish Date - 2022-06-16T17:46:37+05:30 IST

ఏపీలో సైకో పాలన నడుస్తుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

Chandrababu: ఏపీలో సైకో పాలన

అనకాపల్లి జిల్లా: ఏపీలో సైకో పాలన నడుస్తుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం అనకాపల్లి పార్లమెంట్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. చోడవరం సభను విజయవంతం చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. NTR స్ఫూర్తితో మనం ప్రజల పక్షాన పోరాటాలు చెయ్యాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడు కోవాలంటే క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో పని చెయ్యాలని సూచించారు.మూడేళ్ల జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. డ్రైవింగ్ రాని వారిని సీట్లో కూర్చోపెడితే వెనక్కి తీసుకెళ్తారని..ఇప్పుడు జగన్ పాలన కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. నిన్న సభలో మనం పోలీసుల సమస్యలపై మాట్లాడితే పెండింగ్ నిధులు విడుదల చేశారని చెప్పారు. ఉద్యోగులు, పోలీసులకు సమస్యలు వస్తే కూడా మాట్లాడేది టీడీపీనేనని చెప్పారు. ఒక్క పోలీసుల నిధులే కాదు...అందరి బకాయిలు విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.అందరి లెక్కలు రాస్తున్నాం.... వేధింపులకు తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

Updated Date - 2022-06-16T17:46:37+05:30 IST