అమరావతి: జగన్ ప్రభుత్వం తన అసమర్థతతో పోలవరాన్ని బలి చేసిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే మూడేళ్లపాటు ప్రభుత్వం ఎందుకు దాచిందని ప్రశ్నించారు. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి ప్రాజెక్టును నాశనం చేశారని మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్ ఎలా కూలిందో చెప్పకుండా.. మాపై ఆరోపణలు చేయొద్దన్నారు.సీపీఎస్ ఉద్యమంపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోందని అన్నారు. హక్కుల కోసం పోరాటలు చేస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. విద్యా సంవత్సరాన్ని జూన్ 12 నుంచి జులై 8కి మార్చడమేంటి?అని నిలదీశారుప్రభుత్వ వైఫల్యాల వల్లే ఏపీలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు.
ఇవి కూడా చదవండి