ప్రజలను నమ్మించి మోసం చేశారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-08-07T22:47:22+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ప్రజలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశారని

ప్రజలను నమ్మించి మోసం చేశారు: చంద్రబాబు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై ఇవాళ ఆన్‌లైన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. అమరావతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చంద్రబాబు పిలుపునిచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగమే అమరావతి అన్న విషయాన్ని బాబు గుర్తు చేశారు. 


అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని.. రాజధాని కోసం రైతులు ముందుకొచ్చి 33 వేల ఎకరాలిచ్చారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ వేసిందని బాబు తెలిపారు. 50 శాతం కంటే ఎక్కువ ప్రజలు విజయవాడలో రాజధాని ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారని బాబు చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో 160 ప్రాజెక్టులను అన్ని జిల్లాలకు ప్రకటించామని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Updated Date - 2020-08-07T22:47:22+05:30 IST