వైసీపీ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే..: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-02-19T22:37:57+05:30 IST

మేదరమెట్ల (ప్రకాశం): వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే..: చంద్రబాబు

మేదరమెట్ల (ప్రకాశం): వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బుధవారం ఆయన ప్రకాశం జిల్లా మేదరమెట్లలో మాట్లాడుతూ టీడీపీ నేతలందరికీ సెక్యూరిటీ తగ్గించారని, దోపిడీ చేసుకోడానికి వైసీపీ దొంగలకు భద్రత పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే తన సెక్యూరిటీ తగ్గించాలన్న ఆయన.. తమని ప్రజలే కాపాడుకుంటారని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే.. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు.


వైసీపీ 9 నెలల పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని చంద్రబాబు అన్నారు. పరిపాలన ఇలాగే ఉంటే పిల్లల భవిష్యత్‌ ఏమౌతుందని ప్రశ్నించారు. ఇది రద్దుల ప్రభుత్వం.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. సీఎం జగన్ అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదల కడుపుకొట్టారన్నారు. పేదవాళ్లు తిండి తినడం కూడా ముఖ్యమంత్రికి ఇష్టంలేదన్నారు. జగన్‌.. మూడు ముక్కలాట ఆడుతున్నారని, ఏపీకి మూడు రాజధానులు అని చెప్తే నవ్వుతారని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2020-02-19T22:37:57+05:30 IST