అడ్డంగా దొరికిన దొంగ: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-01-13T17:50:42+05:30 IST

చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

అడ్డంగా దొరికిన దొంగ: చంద్రబాబు

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రైతులకు అన్ని విధాల సహాయం చేస్తామని చెప్పారని, ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ఏడుసార్లు తుపాన్లు, వరదలు వచ్చాయని.. ప్రభుత్వం నుంచి ఎవరికైనా సాయం అందిందా అని నిలదీశారు. తుఫాన్, వరదలతో రైతులు చితికిపోతే నష్టపరిహారం ఇవ్వలేదని విమర్శించారు. రైతుల పంటల బీమా ప్రీమియంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశానన్నారు. దానికి సమాధానంగా కట్టామని చెప్పారని, ఆధారాలు చూపించమంటే చూపించలేదని.. దాంతో నిరసన తెలుపుతూ పొడియం ముందు బైటాయించాన్నారు. దీంతో ఆ సాయంత్రం డబ్బులు కడతామని జీవో జారీ చేశారని.. అడ్డంగా దొరికిన దొంగ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-01-13T17:50:42+05:30 IST