చంద్రబాబు, దగ్గుబాటి ఆత్మీయ సమ్మేళనం
ABN , First Publish Date - 2021-12-10T23:58:04+05:30 IST
చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు ఆత్మీయంగా
హైదరాబాద్: చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు ఆత్మీయంగా మాట్లాడుకున్నాయి. చాలా కాలం తర్వాత చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు కలిశాయి. ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి కూతురు ఎంగేజ్మెంట్లో ఈ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, భువనేశ్వరి ఆప్యాయంగా పలకరించుకుని మనసు విప్పి మాట్లాడుకున్నారు. రెండు కుటుంబాల ఆత్మీయ పలకరింపులను అతిథులు ఆసక్తిగా గమనించారు. కొన్నేళ్లుగా ఇరు కుటుంబాల మధ్య మాటలు లేని విషయం తెలిసిందే.