వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే..: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-05-27T19:14:55+05:30 IST

వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే..: చంద్రబాబు

ఒంగోలు : వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. నేడు ఒంగోలు(Ongole)లో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నేడు పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కోసం పనిచేసే వాళ్లకే అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్ర అప్పుల భారం రూ.8 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాళా తీసిందన్నారు. ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘సంక్షేమం లేదు.. అంతా మోసకారి సంక్షేమమే. వైసీసీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు. నిన్న ISBలో ప్రధాని నా పేరును ప్రస్తావించకపోవచ్చు. కానీ నా కృషి వల్లే ISB.. హైదరాబాద్‌కు వచ్చింది. రూ.2 లక్షల కోట్ల సంపదను నాశనం చేశారు. పోలవరం డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. మద్యం, గంజాయి, డ్రగ్స్‌తో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారు. కేంద్రం దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ప్రాజెక్టులు కట్టడం చేతకాకపోతే ఏపీ ప్రభుత్వం గద్దె దిగిపోవాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-27T19:14:55+05:30 IST