గొడ్డలిపోటును గుండెపోటని చెప్పి రాజకీయాలు చేశారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-05-27T18:34:09+05:30 IST

గొడ్డలిపోటును గుండెపోటని చెప్పి రాజకీయాలు చేశారని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు

గొడ్డలిపోటును గుండెపోటని చెప్పి రాజకీయాలు చేశారు: చంద్రబాబు

ఒంగోలు : గొడ్డలిపోటును గుండెపోటని చెప్పి రాజకీయాలు చేశారని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. నేడు ఒంగోలు(Ongole)లో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కోడి కత్తి డ్రామా ఆడారన్నారు. ఒక్క ఛాన్స్‌ అంటే ప్రజలు నమ్మారన్నారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ(MLC) అనంతబాబు హత్య చేశాడన్నారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు కోనసీమ(Konaseema) అల్లర్లు తీసుకొచ్చారన్నారు. కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని వాపోయారు. ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘మంత్రిని కాపాడిన పోలీసులు ఇల్లు తగలబడుకుండా ఎందుకు ఆపలేదు? మీరే దాడిచేసుకొని మీరే రాజకీయం చేస్తున్నారు. రాజ్యసభ(Rajyasabha) సీట్లలో ముగ్గురు మరో రాష్ట్రం వాళ్లకు ఇచ్చారు. సహ నిందితులకు రాజ్యసభ సీట్లు ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామన్నారు ఏమైంది? 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. పోలవరం ఏమైంది..? విభజన హామీల అమలు ఏమయ్యాయి? గెలిచిన తర్వాత కేంద్రం దగ్గర మెడలు వంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. జగన్‌(Jagan) దిగిపోతే తప్ప మంచి రోజులు రావు. జగన్‌ అండ్‌ కంపెనీ ఆదాయం పెరిగింది. క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఏపీ నినాదం ప్రతి ఇంట్లో వినిపించాలి. 


Updated Date - 2022-05-27T18:34:09+05:30 IST