ఢిల్లీలో YCP ప్రభుత్వం బిచ్చం ఎత్తుకుంటోంది: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-12-15T20:13:59+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 3 టాయిలెట్లు కట్టలేని జగన్.. 3 రాజధానులు కడతారా? అంటూ మండిపడ్డారు

ఢిల్లీలో YCP ప్రభుత్వం బిచ్చం ఎత్తుకుంటోంది: చంద్రబాబు

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 3 టాయిలెట్లు కట్టలేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. 3 రాజధానులు కడతారా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు సమక్షంలో రిటైర్డ్ ఐపీఎస్ శేక్షావలి, నూర్ భాషా వర్గ నేతలు టీడీపీలో చేరారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. మైనారిటీల అభివృద్ధికి టీడీపీ ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రపతిగా కలాంను చేసిన సందర్భం ఎక్కువ తృప్తి నిచ్చిందని స్పష్టం చేశారు. ఐటీకి ఇచ్చిన ప్రోత్సహం వల్లే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉన్నాడని తెలిపారు.


అమరావతి గ్రాఫిక్స్ అంటున్న వైసీపీ నేతలు... హైదరాబాద్‌లో తాను ఏమి చేసానో చూడాలని సూచించారు. ఢిల్లీలో వైసీపీ ప్రభుత్వం బిచ్చం ఎత్తుకుంటోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక కష్టాల నుంచి కాపాడాలని వేడుకుంటుందని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేసి.. ఇప్పుడు అడుక్కుంటే అవుతుందా? అని నిలదీశారు. రెండు కళ్లుగా ఉన్న అమరావతి, పోలవరాన్ని పొడిచేసి ఏపీని గుడ్డిగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో ఏపీని ఇంత భ్రష్టు పట్టించిన సీఎం ఎక్కడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.


సీపీఎస్ రద్దుపై జగన్ హామీ ఏమైంది? అని చంద్రబాబు నిలదీశారు. హామీ నెరవేర్చకపోతే చెప్పుతో కొట్టండన్న ఆయన.. ఇప్పుడేం చెబుతారు? అని ప్రశ్నించారు. జగన్ ఒక దొంగ పిల్లి.. కళ్లు మూసుకుని పాలు తాగుతూ.. ఎవరూ చూడడం లేదనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్‌ అని ఓటేసిన ప్రజలు.. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు తెలిపారు.

Updated Date - 2021-12-15T20:13:59+05:30 IST