క్షేత్రస్థాయి కమిటీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2022-05-17T23:00:44+05:30 IST

క్షేత్రస్థాయి కమిటీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

క్షేత్రస్థాయి కమిటీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

అమరావతి: క్షేత్రస్థాయి కమిటీలతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బాదుడే బాదుడు, మెంబర్‌షిప్, ఓటర్ వెరిఫికేషన్, మహానాడుపై సమీక్ష నిర్వహించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు టీడీపీ ఇప్పుడు ఒక హోప్‌గా కనిపిస్తుందన్నారు. గ్రామాల్లో టీడీపీకి స్వాగతాలు... గడపగడపలో వైసీపీ నేతలకు నిలదీతలే అందుకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. జగన్‌ పథకాలు బూటకమేనని ప్రజలకు అర్థమౌతుందన్నారు. అన్ని గమనించే జగన్‌ ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నారని చెప్పారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. అన్నివర్గాల్లో ప్రభుతంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని ఎంతోకాలం నడపలేమని సీఎంకు అర్థమైందన్నారు. అందుకే ముందస్తు ఎన్నికలు వెళ్లాలని జగన్‌ భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-05-17T23:00:44+05:30 IST