Bojjala కుటుంబీకులకు చంద్రబాబు ఓదార్పు

ABN , First Publish Date - 2022-05-09T01:13:25+05:30 IST

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు ముగిసిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు ఊరందూరు గ్రామంలోని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నివాసానికి వెళ్లారు.

Bojjala కుటుంబీకులకు చంద్రబాబు ఓదార్పు

తిరుపతి: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు ముగిసిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు ఊరందూరు గ్రామంలోని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నివాసానికి వెళ్లారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. అరగంట పాటు ఆయన వారితో గడిపారు. గోపాలకృష్ణారెడ్డితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంత్యక్రియలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పల్లె రఘునాధరెడ్డి, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, అమరనాధరెడ్డి, ఎమ్మెల్సీలు దొరబాబు, బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు లలితకుమారి, శంకర్‌, సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఆప్కాబ్‌ మాజీ ఛైర్మన్‌ నల్లారి తిమ్మారెడ్డి, టీడీపీ స్టేట్‌ మీడియా కోఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌, తిరుపతి మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ కందాటి శంకర్‌రెడ్డి, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి బలరామయ్య తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని గోపాలకృష్ణారెడ్డికి నివాళులర్పించారు.

Read more