నేడు చంద్రబాబు రాక

ABN , First Publish Date - 2021-03-05T06:44:53+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం విశాఖపట్నం వస్తున్నారు.

నేడు చంద్రబాబు రాక

సాయంత్రం 4 గంటలకు పెందుర్తి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం

గోపాలపట్నం, ఎన్‌ఏడీ, కంచరపాలెం మీదుగా అక్కయ్యపాలెం వరకూ రోడ్‌షో

విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం విశాఖపట్నం వస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు పెందుర్తి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం, ఎన్‌ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం, తాటిచెట్లపాలెం మీదుగా అక్కయ్యపాలెం వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేస్తారు. తిరిగి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జీవీఎంసీ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు గురువారం రాత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నగర నేతలతో సమావేశం నిర్వహించారు. నిమ్మల రామానాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 




 


Updated Date - 2021-03-05T06:44:53+05:30 IST