హైదరాబాద్ ఇంటికి చేరుకున్న చంద్రబాబు

ABN , First Publish Date - 2021-03-02T01:04:05+05:30 IST

హైదరాబాద్ ఇంటికి చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్ ఇంటికి చేరుకున్న చంద్రబాబు

తిరుపతి: రేణిగుంట ఎయిర్ పోర్టులో చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు తెర పడింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరసన దీక్ష విరమించి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సోమవారం ఉదయం నుంచి ఎయిర్ పోర్టులో టెన్షన్ వాతావరణం నెలకొంది. చిత్తూరు జిల్లాలో పర్యటించేందుకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు వెళ్లిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు లేవంటూ ఆయనను కదలనివ్వలేదు. దీంతో చంద్రబాబు ఎయిర్ పోర్టులో నిరసన దీక్ష కొనసాగించారు. ప్రభుత్వం, పోలీసుల తీరును తప్పుబట్టారు. సాయంత్రం చిత్తూరు రూరల్‌ ఎస్పీతో చర్చించిన తర్వాత చంద్రబాబు తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని రోడ్డు మార్గాన చంద్రబాబు ఇంటికి వెళ్లారు. 

Updated Date - 2021-03-02T01:04:05+05:30 IST