ఒంటరిగా పోరాటం చేతకాక Chandrababu పొత్తులపై ఆరాటం: ROJA

ABN , First Publish Date - 2022-05-07T02:46:37+05:30 IST

ఒంటరిగా పోరాటం చేతకాక Chandrababu పొత్తులపై ఆరాటం: ROJA

ఒంటరిగా పోరాటం చేతకాక Chandrababu పొత్తులపై ఆరాటం: ROJA

విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఏపీ మాజీ చంద్రబాబు పర్యటన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని YCP MINISTER RK ROJA అన్నారు. అధికారం లేదు.. ఇక రాదు అని అక్కసుతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని మంత్రి మండిపడ్డారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు టీ కొట్టుకు వెళ్తే జై జగన్ అని అక్కడ ఉన్న యువత అనడంతో అక్కడి నుంచి పక్కకు జారుకున్నారని రోజా ఎద్దేవా చేశారు. 2024లో చంద్రబాబునాయుడుకు బాదుడే బాదుడు అని, ఒంటరిగా పోరాటం చేయడానికి చేతకాక పొత్తులపై ఆరాటపడుతున్నారని రోజా విమర్శించారు. నీకు అధికారం ఇస్తే అన్న క్యాంటిన్ల నుంచి అమరావతి వరకు నువ్వు, నీ కొడుకు ఈ రాష్ట్రాన్ని రాబందుల్లా తిన్నారని రోజా ఆరోపించారు. చిన్న పిల్లల కోడి గుడ్ల దగ్గర్నుంచి ఫైవ్ స్టార్ వంటల వరకు దోచుకున్నది మీరే అని, ఆంధ్రప్రదేశ్ నుంచి Chandrababuను క్విట్ చేయాలని రోజా ప్రజలకు పిలుపునిచ్చారు. అంతకు ముందు విశాఖపట్నం విమానాశ్రయంలో YCP MINISTER RK ROJAకు అధికారులు, వైసీపీ శ్రేణులు స్వాగతం పలికారు.

Read more