ఫైబర్నెట్ ఆపరేటర్లపై పోలీసుల ఉక్కుపాదం
ABN , First Publish Date - 2021-02-25T16:52:06+05:30 IST
ఫైబర్నెట్ ఆపరేటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
కడప జిల్లా: ఫైబర్నెట్ ఆపరేటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కేబుల్ ఆపరేటర్ల చలో విజయవాడను అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కేబుల్ ఆపరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ నిలిపివేత, ప్యాకేజీల మార్పు సమస్యలపై ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. కడప జిల్లా కేబుల్ ఆపరేటర్లు చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా కడప చిన్నచౌక్ పోలీసులు అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేస్తున్నారని కేబుల్ ఆపరేటర్ల జేఏసీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తమ గోడు వినిపించుకునేందుకు చలో విజయవాడ కార్యక్రమం చేపడుతుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు నిలుపుదల చేశారన్నారు.