చలో రాజ్‌భవన్‌ భగ్నం

ABN , First Publish Date - 2022-08-06T09:01:55+05:30 IST

చలో రాజ్‌భవన్‌ భగ్నం

చలో రాజ్‌భవన్‌ భగ్నం

శైలజానాథ్‌తోపాటు పలువురి అరెస్టు

విజయవాడ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): నిత్యావసర వస్తువుల ధరల పెరుగులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ర్యాలీగా రాజ్‌భవన్‌కు బయలుదేరారు. పోలీసులు అప్రమత్తమై.. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం పరిసరాల్లో వలయంలా ఏర్పడ్డారు. కార్యాలయం నుంచి బయటకు ఎవరినీ రాకుండా అడ్డుకున్నారు. అయినా పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసులను తోసుకుంటూ బయటకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌, ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, పీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్‌, విజయవాడ నగర కమిటీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహరావు తదితరులను అరెస్టు చేశారు. అనంతరం వారిని వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2022-08-06T09:01:55+05:30 IST