దాహార్తి తీరుస్తున్న చలివేంద్రాలు
ABN , First Publish Date - 2022-05-21T04:50:10+05:30 IST
మండలకేంద్రమైన దొనకొండలోని రెండు ప్రధాన సెంటర్లల్లో వేసవిలో ప్రజల దాహార్తి నిమిత్తం టీడీపీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు సూచన మేరకు నాయకులు ఏర్పాటు చేసిన కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రాలు ప్రస్తుతం ప్రజలకు ఎంతో ఉపయోగకరమయ్యాయి.
దొనకొండలో టీడీపీ ఆధ్వర్యంలో రెండు చోట్ల ఏర్పాటు
దొనకొండ, మే 20 : మండలకేంద్రమైన దొనకొండలోని రెండు ప్రధాన సెంటర్లల్లో వేసవిలో ప్రజల దాహార్తి నిమిత్తం టీడీపీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు సూచన మేరకు నాయకులు ఏర్పాటు చేసిన కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రాలు ప్రస్తుతం ప్రజలకు ఎంతో ఉపయోగకరమయ్యాయి. ప్రధాన కూడలి అయిన ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు పత్తి వెంకటేశ్వర్లు, విప్పర్ల లక్ష్మీరావు, మన్నెం గాలెయ్యలు, ప్రధాన వ్యాపార సముదాయాల వద్ద టీడీపీ నాయకులు కామేపల్లి చెంచయ్య, తోట కోటేశ్వరరావు, పి. రామాంజనేయులు, బోయపాటి సుబ్బయ్యలు కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రారంభం నుంచి ప్రతిరోజూ ఒకొక్కదానిలో దాదాపు 15 బబుళ్ల మినరల్ వాటర్ పోయిస్తూ ప్రజలకు కూలింగ్ వాటర్ అందిస్తున్నారు. రెండు ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేయటంతో రైలు, బస్సుల ప్రయాణికులు, పాదచారులు, స్థానికులు, ద్విచక్ర వాహనదారులు, ఆటోల్లో వెళ్లే ప్రజలు కూలింగ్ వాటర్ కావటంతో తాగి సీసాల్లో పట్టుకెళుతున్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో వేసవి ఎండల్లో దాహార్తి నిమిత్తం కూలింగ్ చలివేంద్రాలను ఏ ర్పాటు చేసి బాధ్యతగా నిర్వహిస్తున్న టీడీపీ నాయకులను ప్రజలు అభినందిస్తున్నారు.