Governor Tamilisai: చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించిన గవర్నర్

ABN , First Publish Date - 2022-09-26T16:46:20+05:30 IST

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి గవర్నర్ తమిళ సై పూలమాల వేసి నివాళులర్పించారు.

Governor Tamilisai: చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించిన గవర్నర్

హైదరాబాద్ (Hyderabad): చాకలి ఐలమ్మ (Chakali Ilamma) జయంతి సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్‌ వద్ద ఆమె  విగ్రహానికి గవర్నర్ తమిళ సై (Governor Tamilisai) నివాళులర్పించారు. కాగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt.) అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వ వేడుకలకు గవర్నర్‌కు ఆహ్వానం అందలేదు. దీంతో ట్యాంక్ బండ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి గవర్నర్ తమిళి సై పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


ఈ సందర్బంగా గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలని, నిజాం నవాబు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్పయోధురాలని కొనియాడారు. పీడిత ప్రజల కోసం ఎనలేని పోరాటం చేసిన మహిళ చాకలి ఐలమ్మ అని, ఆమె త్యాగం ఎంతో గొప్పదని గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు.

Updated Date - 2022-09-26T16:46:20+05:30 IST