టీఆర్‌ఎస్‌ అనుబంధ కమిటీల అధ్యక్షుల నియామకం

ABN , First Publish Date - 2021-10-19T05:04:31+05:30 IST

టీఆర్‌ఎస్‌ అనుబంధ కమిటీల అధ్యక్షుల నియామకం

టీఆర్‌ఎస్‌ అనుబంధ కమిటీల అధ్యక్షుల నియామకం
మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాన్ని అందుకుంటున్న టి.ఇందిరదేవేందర్‌

కందుకూరు: టీఆ ర్‌ఎస్‌ మండల అనుబంధ కమిటీల అధ్యక్షులను నియమించిన ట్లు మంత్రి సబితారెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని తన నివాసంలో నియామకపత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కందుకూరు మండల మహిళా విభాగం అధ్యక్షురాలిగా దాసర్లపల్లి ఎంపీటీసీ తాండ్ర ఇందిరదేవేందర్‌, యూత్‌ వింగ్‌ అధ్యక్షుడిగా దెబ్బడగూడకు చెందిన కొలన్‌ విఘ్నేశ్వర్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మురళీనగర్‌కు చెందిన రామాంజనేయులు, రైతు కమిటీకి నేదునూరుకు చెందిన సోలిపేట అమరేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్‌కు రాచులూరుకు చెందిన గుయ్యని సామయ్యలను అధ్యక్షులుగా నియమించినట్లు తెలిపారు. త్వరలో పార్టీ మండల అధ్యక్షుడు మన్నె జయేందర్‌ ముదిరాజ్‌ పూర్తిస్థాయి కమిటీలను నియమించాలని మంత్రి ఆదేశించారు. జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వరలక్ష్మీసురేందర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, వైస్‌చైర్మన్‌ జి.విజయేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు రాజశేఖర్‌రెడ్డి, కాకి రాములు, సురేష్‌, లలితకుమార్‌, యాదయ్య, సర్పంచ్‌లు గోపాల్‌రెడ్డి, బాలమణిఅశోక్‌, నాయకులు దీక్షిత్‌రెడ్డి, పాండుగౌడ్‌, ప్రశాంత్‌చారి, ప్రకాశ్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T05:04:31+05:30 IST