దేవాదాయశాఖ కమిషనర్ను కలిసిన మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్
ABN , First Publish Date - 2021-06-19T05:40:46+05:30 IST
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి శుక్రవారం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ను హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు.
చేర్యాల, జూన్ 18: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి శుక్రవారం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ను హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేసిన క్యూలైన్ కాంప్లెక్స్, 75 గదుల సత్రం, ఇతరత్రా అభివృద్ధి పనులకు సంబంధించిన నిఽధులు మంజూరికి చర్యలు తీసుకుని పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట ఆలయ ఈవో బాలాజీ శర్మ, అర్చకుడు మహదేవుని మల్లికార్జున్ ఉన్నారు.