ప్రొటోకాల్‌పై మండలి చైర్మన్‌ అసంతృప్తి

ABN , First Publish Date - 2022-08-06T09:06:16+05:30 IST

ప్రొటోకాల్‌పై మండలి చైర్మన్‌ అసంతృప్తి

ప్రొటోకాల్‌పై మండలి చైర్మన్‌ అసంతృప్తి

భీమవరంటౌన్‌, ఆగస్టు 5 : భీమవరంలో 82 ఎకరాల్లో టిడ్కో ఇళ్ళ పంపిణీలో ప్రొటోకాల్‌ వివాదం తలెత్తింది. జ్యోతి ప్రజ్వలన సమయంలో మంత్రులను పిలిచి, శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజును విస్మరించారు. దీనిపై ఆయన ప్రొటోకాల్‌ పాటించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ మోషేన్‌రాజు చేతిని పట్టుకుని జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ప్రాంతానికి స్వయంగా తీసుకువెళ్లారు. దీంతో సమస్య సద్దుమణిగింది. 

Updated Date - 2022-08-06T09:06:16+05:30 IST