బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్గా మరియకుమార్రెడ్డి
ABN , First Publish Date - 2020-05-29T07:50:49+05:30 IST
ఆంధ్రప్రదేశ్ బయో డైవర్సిటీ బోర్డు(జీవ వైవిధ్య మండలి)కి కొత్త పాలకవర్గాన్ని పునర్నియమిస్తూ
అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ బయో డైవర్సిటీ బోర్డు(జీవ వైవిధ్య మండలి)కి కొత్త పాలకవర్గాన్ని పునర్నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డు చైర్మన్గా ఐసీఏఆర్ విశ్రాంత శాస్త్రవేత్త బండి మరియకుమార్రెడ్డిని నియమించారు. సభ్యులుగా అటవీ, పశుసంవర్ధక, వ్యవసాయ, పురపాలకశాఖల కార్యదర్శులు, బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి ఉంటారు.