మణుగూరులో చైన్ స్నాచింగ్
ABN , First Publish Date - 2020-02-20T10:33:22+05:30 IST
ఇంటి వాకిలి ఊకుతున్న మహిళ మెడ నుంచి బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగుడు అపహరించాడు.
మణుగూరు, ఫిబ్రవరి 19: ఇంటి వాకిలి ఊకుతున్న మహిళ మెడ నుంచి బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగుడు అపహరించాడు. ఈ సంఘటన భద్రాద్రి జిల్లా మణుగూరు పట్టణంలోని శ్రీశ్రీనగర్లో బుధవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీశ్రీనగర్కు చెందిన ఇస్లావత్ రాజు భార్య ఇస్లావత్ ప్రమీల పినపాక మండలంలో టీచర్గా విధులు నిర్వహిస్తోంది.
బుధవారం ఉదయాన్నే ఇంటి ఎదుట పరిసరాలను చీపురుతో ఊడ్చుతుంది. ఈ క్రమంలో గుర్తుతెలియని ఆగంతకుడు ఒకరు ద్విచక్రవాహానంపై వచ్చి తన మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కోని పరారాయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.