‘చాయ్‌ పే చర్చాగోష్టి’కి cm శ్రీకారం

ABN , First Publish Date - 2021-10-14T17:32:52+05:30 IST

ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పలు వినూత్న ప్రయోగాలకు తెరలేపుతున్నారు. తాజాగా ఆయన ఉడుపి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం కుశాల్‌నగర్‌లో బంటర సంఘం ఏర్పాటు చేసిన చాయ్‌ పే చర్చాగోష్టిలో

‘చాయ్‌ పే చర్చాగోష్టి’కి cm శ్రీకారం

బెంగళూరు: ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పలు వినూత్న ప్రయోగాలకు తెరలేపుతున్నారు. తాజాగా ఆయన ఉడుపి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం కుశాల్‌నగర్‌లో బంటర సంఘం ఏర్పాటు చేసిన చాయ్‌ పే చర్చాగోష్టిలో పాల్గొన్నారు. ఉడుపి జిల్లాకు చెందిన పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాల్గొని చాయ్‌ తాగుతూనే సీఎం సమాలోచనలు జరిపారు. ఇకపై జిల్లా పర్యటనకు వెళ్లిన సమయాల్లో పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా చాయ్‌ పే చర్చాగోష్టిని కొనసాగించాలని సీఎం భావిస్తున్నారు. ప్రధాని మోదీతో స్ఫూర్తి పొంది ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేయబోతున్నట్టు తెలిపారు. చర్చాగోష్టిలో యువ పారిశ్రామికవేత్తలకు సీఎం ప్రాధాన్యత ఇచ్చారు. వారు చెప్పిన బిజినెస్‌ ఐడియాలను శ్రద్ధతో ఆలకించారు. 

Updated Date - 2021-10-14T17:32:52+05:30 IST