మల్లు స్వరాజ్యం ఆశయాలు నెరవేరలేదు: చాడ
ABN , First Publish Date - 2022-03-20T16:13:41+05:30 IST
మల్లు స్వరాజ్యం ఆశయాలు నెరవేరలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బందూకు చేతబట్టిన ధీశాలి మల్లు స్వరాజ్యం ఆశయాలు నెరవేరలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దోపిడీ రాజ్యం పోవాలని, కమ్యూనిస్టు రాజ్యం రావాలన్నారు. వామపక్ష ఐక్య పోరాటాలతో మల్లు స్వరాజ్యం ఆశయసాధనకు కృషి చేస్తామని చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
అనారోగ్యం, వయసు రీత్యా ఎదురయ్యే సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మల్లు స్వరాజ్యంను ఈ నెల 1న హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేర్చారు. కొద్ది రోజుల చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగుపడడంతో.. ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చారు. శుక్రవారం ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఐసీయూకు తరలించి వెంటిలేటర్పై ఉంచారు. శనివారం రాత్రి 7.35కు స్వరాజ్యం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.