ఐదేళ్లలో 2,000 మంది నిపుణులు

ABN , First Publish Date - 2020-02-21T06:36:24+05:30 IST

న్యూయార్క్‌ కేం ద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కంప్యూటర్‌ జనరేటెడ్‌ సొల్యూషన్స్‌ (సీజీఎస్‌) హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది.

ఐదేళ్లలో 2,000 మంది నిపుణులు

  • హైదరాబాద్‌లో సీజీఎస్‌ విస్తరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): న్యూయార్క్‌ కేం ద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కంప్యూటర్‌ జనరేటెడ్‌ సొల్యూషన్స్‌ (సీజీఎస్‌) హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందుకు అనుగుణంగా కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్‌, అపెరల్‌, రిటైల్‌, హెల్త్‌కేర్‌ వంటి అనేక రంగాల్లోని కంపెనీలకు బిజినెస్‌ సొల్యూషన్లు అందించడంతో పాటు కంపెనీలకు ఇ-లెర్నింగ్‌, బీపీఓ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌  కేంద్రంలో 500 మందికి పైగా నిపుణులు పని చేస్తున్నారని.. వచ్చే ఆరు నెలల్లో మరో 300 మంది నిపుణులను నియమించుకోనున్నామని సీజీఎస్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ ఫిల్‌ ఫ్రైడ్‌మెన్‌ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఈ కేంద్రంలో నిపుణుల సంఖ్య 2,000కి చేరనుందన్నారు. కొత్త ప్రాంగణంతో కంపెనీకి అమెరికా వెలుపల అతిపెద్ద డెవల్‌పమెంట్‌ కేంద్రం ఇదే అవుతుందని సీజీఎస్‌ ఇండి యా ఎండీ జితేంద్ర రావు బట్టు తెలిపారు. 

Updated Date - 2020-02-21T06:36:24+05:30 IST