చేపల చెరువులో విషగుళికలు

ABN , First Publish Date - 2021-07-27T03:19:40+05:30 IST

: పాత కక్షలు మనసులో పెట్టుకొని గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో సుమారు రూ.7.50లక్షల నష్టం

చేపల చెరువులో విషగుళికలు
మృతి చెందిన చేపలు

 రూ.7.50లక్షల నష్టం

తోటపల్లిగూడూరు, జూలై 26 : పాత కక్షలు మనసులో పెట్టుకొని గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో సుమారు రూ.7.50లక్షల నష్టం వాటిల్లింది.  బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తోటపల్లిగూడూరు మండలం ఈదూరుకి చెందిన పెమ్మారెడ్డి సరస్వతి(54)కి చెందిన 3.50 ఎకరాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం విషగుళికలు కలిపారు. దాంతో చెరువులోని చేపలు, రొయ్యలు చనిపోయాయి. మృతి చెందిన చేపల విలువ సుమారుగా రూ.7.50లక్షలు ఉంటుందని అంచనా, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మృతి చెందిన చేపలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. కాగా తనపై కక్షతోనే నిందితులు ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని బాధితురాలు అనుమానం వ్యక ్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-07-27T03:19:40+05:30 IST