కశ్మీర్‌ స్థానికుల కోసం కొత్త చట్టం

ABN , First Publish Date - 2020-08-08T08:37:47+05:30 IST

కశ్మీర్‌ స్థానికుల్లో భూముల విషయంలో ఉన్న భయాల్ని పొగొట్టేందుకు గాను కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. కశ్మీర్‌లో ఇంకా ఎన్నికలు జరగనందున...

కశ్మీర్‌ స్థానికుల కోసం కొత్త చట్టం

  • భూ హక్కుల పరిరక్షణకై..
  • కొత్త చట్టాన్ని తెచ్చే యోచనలో కేంద్రం

న్యూఢిల్లీ, ఆగస్టు 7: కశ్మీర్‌ స్థానికుల్లో భూముల విషయంలో ఉన్న భయాల్ని పొగొట్టేందుకు గాను కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. కశ్మీర్‌లో ఇంకా ఎన్నికలు జరగనందున, ఈ చట్టాన్ని పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టనుంది. గత ఏడాది ఆగస్టు 5న 370వ అధికరణ నిర్వీర్యం, 35ఏ అధికరణల రద్దు కారణంగా కశ్మీర్‌లో ప్రజల్లో తమ భూములపై హక్కులు కోల్పోతామన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. తాజాగా ప్రవేశపెట్టనున్న చట్టంతో వారి భయాలు పూర్తిగా తొలగిపోతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. కశ్మీర్‌లో స్థానికత నిబంధనలను కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్‌ 3న మార్చింది. దాని ప్రకారం.. అక్కడ 15ఏళ్లపాటు నివసించిన వారిని స్థానికులుగా గుర్తిస్తారు. వీరితో పాటు కశ్మీర్‌లో కనీసం పదేళ్ల పాటు పనిచేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను, వారి పిల్లలను కూడా స్థిరనివాసం ఏర్పరుచుకున్నవారిగా పరిగణించనున్నారు


Updated Date - 2020-08-08T08:37:47+05:30 IST