లైట్లు ఆర్పమన్నారు సరే.. వాళ్ల బాధ కూడా వినండి: ప్రియాంక

ABN , First Publish Date - 2020-04-05T00:15:36+05:30 IST

ఆదివారం రాత్రి దేశ వ్యాప్తంగా విద్యుద్దీపాలు ఆర్పివేసి, దివ్వెలు వెలిగించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుపై..

లైట్లు ఆర్పమన్నారు సరే.. వాళ్ల బాధ కూడా వినండి: ప్రియాంక

న్యూఢిల్లీ: ఆదివారం రాత్రి దేశ వ్యాప్తంగా విద్యుద్దీపాలు ఆర్పివేసి, దివ్వెలు వెలిగించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. కరోనా వైరస్‌పై దేశం యావత్తూ ఒక్కటిగా నిలిచి పోరాడుతున్న వేళ విద్యుత్ సరఫరాపై ప్రభావం పడేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆమె విమర్శించారు. ‘‘కరోనా వైరస్‌పై పోరాడేందుకు దేశమంతా ఒక్కటిగా నిలుస్తున్న వేళ... పవర్ గ్రిడ్స్, ఇంజినీర్ల ఆందోళనను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఈ సంక్షోభ సమయంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలి..’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు ఓ వార్తా కథనాన్ని కూడా జోడించారు. కరోనా చీకటిని తరిమికొట్టేందుకు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు ఆర్పివేసి... దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు వెలిగించాలంటూ  ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 



Updated Date - 2020-04-05T00:15:36+05:30 IST