మాల్స్, హోటల్స్ ప్రారంభంపై కేంద్రం నిబంధనలు విడుదల
ABN , First Publish Date - 2020-06-05T03:50:24+05:30 IST
నా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 5.0 లాక్ డౌన్ను దేశవ్యాప్తంగా విధించిన విషయం తెలిసిందే.
న్యూ ఢిల్లీ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 5.0 లాక్ డౌన్ను దేశవ్యాప్తంగా విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొన్ని సడలింపులు ఇచ్చిన తాజాగా.. మరికొన్నింటికి అనుమతిస్తూ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ప్రకటన రూపంలో విడుదల చేసింది. జూన్-08 నుంచి కార్యాలయాలు, మతపరమైన ప్రదేశాలు, మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రామాణిక నిబంధనలను కేంద్రం విడుదల చేసింది.