రాష్ట్రాలకు 15 శాతం కోవిడ్ ఎమర్జెన్సీ ప్యాకేజీ నిధుల విడుదల

ABN , First Publish Date - 2021-08-01T00:32:25+05:30 IST

ఆరోగ్య మౌలిక వసతులను మెరుగు పరచేందుకు కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్..

రాష్ట్రాలకు 15 శాతం కోవిడ్ ఎమర్జెన్సీ ప్యాకేజీ నిధుల విడుదల

న్యూఢిల్లీ: ఆరోగ్య మౌలిక వసతులను మెరుగు పరచేందుకు కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టం ప్రిపేర్డ్‌నెస్ (ఈసీఆర్‌పీ-2) ప్యాకేజీ కింద 15 శాతం నిధులను రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శనివారంనాడు ఓ ట్వీట్‌లో ఈ విషయం తెలియజేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.1,827.8 కోట్లు విడుదల చేశామని, ఈ ప్యాకేజీ కింద కేటాయించిన మొత్తం రూ.12,185 కోట్లలో ఇది 15 శాతమని ఆయన తెలిపారు. కోవిడ్‌పై పోరాటంలో దేశం సాధికరత సాధించేందుకు ఈ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా మరింత మేలైన ఆరోగ్య మౌలిక వసుతల కల్పనకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని అన్నారు.


కాగా, శనివారం ఉదయం 8 గంటల వరకూ గత 24 గంటల్లో దేశంలో 41,649 కరోనా కేసులు నమోదు కాగా, 593 మంది మృత్యువాత పడినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. యాక్టివ్ కేసులు వరుసగా నాలుగవ రోజు కూడా స్వల్పంగా పెరిగాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 4,08,920కి చేరుకుంది. వీటిలో మెజారిటీ కేసులు కేరళలో నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల్లో 1.61 లక్షల కేసులు కేరళలో నమోదైనవే.

Updated Date - 2021-08-01T00:32:25+05:30 IST