బెంగళూరులో ఎన్ఐఏ కార్యాలయం: తేజస్వి సూర్య

ABN , First Publish Date - 2020-09-28T01:28:54+05:30 IST

జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సంస్థలకు కళ్లెం వేసేందుకు బెంగళూరులో జాతీయ దర్యాప్తు సంస్థ,,

బెంగళూరులో ఎన్ఐఏ కార్యాలయం: తేజస్వి సూర్య

న్యూఢిల్లీ: జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సంస్థలకు కళ్లెం వేసేందుకు బెంగళూరులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయం ఏర్పాటు కానుందని, ఇందుకు కేంద్రం అంగీకరించిందని బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య తెలిపారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను తాను కలసి బెంగళూరులో పూర్తిస్థాయిలో ఎన్ఐఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశానని, అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. 


'పలు టెర్రర్ మాడ్యూల్స్, స్లీపర్ సెల్స్ బెంగుళూరులో బయటపడ్డాయి. ఎన్ఐఏ శాశ్వాత కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కళ్లెం వేయవచ్చని హోం మంత్రికి చెప్పాను. త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు' అని తేజస్వి సూర్య తెలిపారు. ఆగస్టు 11న ఈస్ట్ బెంగళూరులో చోటుచేసుకున్న హింసాకాండపై మాట్లాడుతూ, పోలీసు స్టేషన్లపై జరిగిన దాడికి సంబంధించి కీలక కుట్రదారులను ఎన్ఐఏ అరెస్టు చేసిందని చెప్పారు. హింసాకాండ అప్పటికప్పుడు జరిగింది కాదని, కుట్ర కోణం ఉందనే విషయం ఈ ఘటనతో వెలుగుచూసిందని పేర్కొన్నారు.

Updated Date - 2020-09-28T01:28:54+05:30 IST