కేంద్ర బృందం సైంటిఫిక్గా వ్యవహరించలేదు: దాసోజు శ్రావణ్
ABN , First Publish Date - 2020-10-24T23:10:05+05:30 IST
కేంద్ర బృందం సైంటిఫిక్గా వ్యవహరించలేదు: దాసోజు శ్రావణ్
హైదరాబాద్: కేంద్ర బృందం సైంటిఫిక్గా వ్యవహరించలేదని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ తప్పుబట్టారు. జీహెచ్ఎంసీ అధికారులు డ్రామా ఆడుతున్నారని, కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. వరదల్లో చనిపోయిన వారి లెక్కలు ప్రభుత్వం దాస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్కు ఏరియల్ సర్వే చేసే సమయం కూడా లేదా? అని శ్రావణ్ ప్రశ్నించారు. కేసీఆర్కు తన ఫాంహౌస్ చెట్లపై ఉన్న ప్రేమ వరద బాధితులపై లేదన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని, వరద సాయాన్ని టీఆర్ఎస్ ఓటు బ్యాంకుగా మలుచుకుంటోందని శ్రవణ్ దుయ్యబట్టారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో అపారమైన ఆస్తి, ప్రాణ నష్టం కూడా సంభవించింది. భారీ వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు... కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నేతృత్వంలో అధికారుల బృందం వరద నష్టాన్ని అంచనా వేసింది. వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టం వివరాలను కేంద్ర బృందానికి అధికారులు అందించారు.