ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం
ABN , First Publish Date - 2021-10-28T05:32:39+05:30 IST
మండలంలోని కె. రాజుపాలెం, కొణిదెనలలో కేంద్ర బృందం బుధ వారం పర్యటించింది. రెండు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను పరి శీలించింది. ఈ సందర్భంగా బృందంలోని సభ్యు లు కూలీలు, ప్రజలతో మాట్లాడి పలు విషయా లను సేకరించారు.
కె.రాజుపాలెం, కొణిదెనలలో పర్యటన
బల్లికురవ, అక్టోబరు 27 : మండలంలోని కె. రాజుపాలెం, కొణిదెనలలో కేంద్ర బృందం బుధ వారం పర్యటించింది. రెండు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను పరి శీలించింది. ఈ సందర్భంగా బృందంలోని సభ్యు లు కూలీలు, ప్రజలతో మాట్లాడి పలు విషయా లను సేకరించారు. కూలి సొమ్ము సక్రమంగా అందుతుందా? లేదా? అని కూలీలను అడిగి తె లుసుకున్నారు. ఉపాధి నిధులతో నిర్మించిన గ్రా వెల్, సిమెంటు రోడ్ల వలన ప్రయోజనాల గు రించి ప్రజలను ఆరా తీశారు. చెత్త నుంచి సం పద తయారీ కేంద్రాలు వినియోగంలో లేనట్లు గుర్తించారు. అన్ని వివరాలను కేంద్ర ప్రభుత్వాని కి నివేదికరూపంలో అందజేస్తామని ఈ సంద ర్భంగా వారు తెలిపారు. అంతకుముందు మం డల స్థాయి అధికారులతో కేంద్ర బృందం సమా వేశమైంది. ఈ సందర్భంగా మండలంలో చేప ట్టిన పనుల వివరాలు, అవి ప్రజలకు ఉపయోగ పడుతున్న తీరును అసిస్టెంట్ ప్రొఫెసర్ భాస్క రన్ సారథ్యంలోనే ఈ బృందం తెలుసుకుంది. డ్వామా పీడీ శీనారెడ్డి, ఏపీడీలు బసవసుబ్బారా వు, బాబూరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఈ వోపీఆర్డీ లక్ష్మీసుసీన, ఏపీవో శైలజ, ఏసీఎం జ్యోతిప్రసాద్బాబు, పీఅర్, గృహనిర్మాణ, అర్ డబ్ల్యూఎస్ శాఖల ఏఈలు హనుమంతరావు, రాజశేఖర్, గిరినాయక్, సర్పంచ్లు అమరనేని నాగలక్ష్మి, తన్నీరు లేపాక్షి, పంచాయతీ కార్యద ర్శులు అనిల్, వెంకట్రావు పాల్గొన్నారు.