గత ఒప్పందాల ప్రకారమే ధాన్యం కొనుగోలు: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-11-29T21:44:08+05:30 IST

గత ఒప్పందాల ప్రకారమే రాష్ట్రం నుంచి కేంద్రం

గత ఒప్పందాల ప్రకారమే ధాన్యం కొనుగోలు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: గత ఒప్పందాల ప్రకారమే రాష్ట్రం నుంచి కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని  కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రైతులకు వరి విత్తనాలు అందించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటన్నారు.


ప్రతిదీ కేంద్ర ప్రభుత్వంపై తోసేస్తున్నారని ఆరోపించారు. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోమని ఎక్కడా చెప్పలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఆందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. ఈ సీజన్‌లో చివరి బస్తా వరకు కేంద్రం కొంటుందని ఆయన పేర్కొ్న్నారు. 




Updated Date - 2021-11-29T21:44:08+05:30 IST