Tollgateలను తొలగించడమే లక్ష్యం
ABN , First Publish Date - 2022-07-13T15:44:50+05:30 IST
దేశంలో టోల్గేట్లు తొలగించాలనేదే కేంద్రప్రభుత్వ లక్ష్యమని కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు. వేలూరు నియోజకవర్గంలో
- కేంద్ర మంత్రి వీకే సింగ్
వేలూరు(చెన్నై), జూలై 12: దేశంలో టోల్గేట్లు తొలగించాలనేదే కేంద్రప్రభుత్వ లక్ష్యమని కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు. వేలూరు నియోజకవర్గంలో నిర్వహించిన జిల్లా బీజేపీ నిర్వాహకుల సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర రహదారులను పరిశీలించామన్నారు. చెన్నై-సేలం మధ్య 8 రహదారుల నిర్మాణానికి 90 శాతం భూసేకరణ పూర్తయిందని, ఒకవేళ ఈ పథకానికి ప్రజలు వ్యతిరేకత తెలిపితే రద్దు చేస్తామని తెలిపారు. వేలూరు విమానాశ్రయ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. అనంతరం వేలూరు జలకంఠేశ్వరుని కేంద్రమంత్రి దర్శనం చేసుకున్నారు.